Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ఎన్నికలతో జగన్‌కు టెన్షన్, ఆ నేతలంతా తిరుపతిలోనే...

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (17:38 IST)
తిరుపతి ఉప ఎన్నికలపై అధికార వైసిపిలో అప్పుడే గుబులు మొదలైంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే ఉప ఎన్నికపై ఆలోచనలో పడ్డారు. ఒకే ఒక్క ఎంపి సీటు కోసం ఏకంగా బిజెపి అధిష్టానమే రంగంలోకి దిగడం.. కేంద్రమంత్రులను, బిజెపి ముఖ్య నేతలందరినీ ప్రచారానికి పంపిస్తుండటంతో వైసిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
 
15 రోజులకు 20 మందికిపైగా బిజెపి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3వ తేదీ నుంచి బిజెపి అభ్యర్థి రత్నప్రభకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తుంటే ఆ తరువాత నుంచి బిజెపి నేతలందరూ క్యూ కడుతున్నారు ప్రచారం కోసం.
 
ఎలాగైనా తిరుపతి ఎంపి సీటును గెలుచుకోవాలన్న ప్రయత్నం బిజెపి-జనసేన నేతల్లో కనిపిస్తోంది. రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా ప్రజల్లోకి వెళుతూ తిరుపతిలో బిజెపి చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే బిజెపి అంటేనే వైసిపి నేతలకు వణుకని.. అందుకే ఆ పార్టీ నేతలపైనా ఎక్కడా విమర్సలు చేయకుండా ప్రచారాన్ని వైసిపి నేతలు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డిని రంగంలోకి దింపి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. తెర వెనుక నుంచి మొత్తం నడిపిస్తున్నారట జగన్. దీంతో తిరుపతి ఎంపి సీటు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments