Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతం వర్శిటీలో ప్రభుత్వ భూముల స్వాధీనం.. కంచె నిర్మాణం.. ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (15:45 IST)
విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య గీతం వర్శిటీలోకి ప్రవేశించిన అధికారులు.. ప్రభుత్వ భూముల సరిహద్దులను గుర్తించి కంచె నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సామాగ్రితోనే లోనికి వెళ్లిన అధికారులు ఆగమేఘాలపై ఈ కంచె నిర్మాణం పూర్తి చేశారు. అంతకుముందు వర్శిటీకి దారితీసే రోడ్లపై రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ రోడ్లపైకి గుర్తింపు కార్డులు చూపించిన స్థానికులనే అనుమతించారు. దీంతో యూనివర్శిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
వర్శిటీలో కంచె నిర్మాణ పనులను శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి చేపట్టారు. ఇందుకోసం అటు వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. ముఖ్యంగా, ఎండాడ, రుషికొండ మార్గాల్లో వర్శిటీకి రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఐడీ కార్డులు చూపించిన స్థానికులను మాత్రమేలోనికి అనుమతించారు. కాగా, ఈ యేడాది జనవరిలో గీతం కళాశాలకు ఆనుకుని వున్న 14 ఎకరాల ప్రభుత్వం భూమిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments