Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:10 IST)
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ‌ల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  గుంటూరు ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మీడియాతో మాట్లాడుతూ, గుడిలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
 
నిందితుల నుంచి ఒక ఆటో, రెండు బైక్ లు, కట్టర్లు, 4,600 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. నిందితులు అంతా గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌ని ఎస్పీ తెలిపారు. 

 
దేవాలయాలల్లో దొంగతనాలకు పాల్పడే మ‌రో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారికోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో సమస్యాత్మక‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నామ‌ని, జిల్లా ఎస్పీ కార్యలయంలో బాధితులు ఫిర్యాదులు చేయ‌డానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని వివరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments