Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు గుడి కట్టిన వైకాపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (12:17 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంతులేని ప్రేమ చూపించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పేరిట దేవాలయాన్ని నిర్మించారు. 
 
రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను నిర్మించారు.
 
మరోవైపు నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ సీఎం జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.2 కోట్ల ఖర్చుతో ఈ దేవాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశంలో మరెక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కొనియాడారు. 
 
కాగా గతంలోనూ ప.గో. జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో సీఎం జగన్‌కు గుడి కట్టేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments