Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలయాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు : నిధులిచ్చిన చెవిరెడ్డి

ఆలయాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు : నిధులిచ్చిన చెవిరెడ్డి
, గురువారం, 12 ఆగస్టు 2021 (15:18 IST)
సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు అధినేత మోహన్ బాబు స్వయంగా శ్రీ సాయిబాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థిక విరాళాన్ని అందజేశారు. 
 
గురువారం రంగంపేట సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో మార్బల్ బండలు వేసేందుకు అవసరమైన రూ.17 లక్షల నిధులను మోహన్ బాబుకు చెవిరెడ్డి అందజేశారు. 
 
అంతేకాకుండా, ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మోహన్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోం మంత్రిని క‌లిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి