Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆంగ్లం... అమెరికాలో "అ.. ఆ"లు... తెలుగులో బ్యాలెట్ పత్రాల ముద్రణ!

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:26 IST)
కోట్లాది మందికి మాతృభాషగా ఉన్న తెలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపేసే ప్రక్రియ కొనసాగుతోందని అనేక మంది భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో బోధించాలని అధికార వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చకచకా అడుగులు వేసింది.

అంతేనా... రాష్ట్రంలోని స్కూల్స్‌లో తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మీడియంను బలవంతంగా తీసుకొచ్చింది. అంటే.. ఆంధ్రలో మాతృభాష అయిన తెలుగును శాశ్వతంగా చంపేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం తెలుగు భాషకు అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు భాషకు అమెరికా పట్టంకట్టింది. అమెరికాలో కమ్యూనికేషన్ కోసం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల మూడో తేదీన జరుగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పటివరకు కొన్ని భారతీయ భాషలు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. ప్రస్తుతం వాటి సరసన తెలుగు కూడా చేరింది. దీంతో తెలుగులో కూడా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగనుంది.
 
అమెరికాలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించడం ద్వారా ఇకపై ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారంతోపాటు అధికార కార్యకలాపాల వివరాలను కూడా తెలుగులో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 
 
కాగా, అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. అమెరికాలో కూడా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే ఉంది. కాగా.. అమెరికాలో తెలుగు భాషకు దక్కిన గౌరవంపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని పలువురు భాషాభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయిన ఏ మీడియంలో చదవాలన్న అంశాన్ని విద్యార్థుల ఇష్టానికే వదిలివేయాలని, ప్రాథమిక విద్యను ఖచ్చితంగా మాతృభాషలోనే బోధించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments