తెలుగు అకాడమీ తెదేపా అకాడమీ కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:22 IST)
తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, మరింత విస్తృతం చేసేందుకే కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ద్రవిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసం సంస్కృతాన్ని జోడించి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తెలుగు అకాడమీ తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించాలని.. తమ విమర్శలు సరిచేసుకోవాలని హితవు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మంత్రి ఆరోపించారు. సంస్కృతం భారతీయ భాషలకు మూలమన్నారు.

దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ ఉంటుందని.. రెండింటినీ వేర్వేరు భాషలుగా చూడలేమని వివరించారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

విభజన తర్వాత రెండేళ్లలో తెలుగు అకాడమీని ఏపీలో ఏర్పాటు చేయలేకపోయారని.. అందుకే ఇప్పుడు రెండింటినీ కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments