Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ జగన్‌ కోసం సంగారెడ్డి యువకుడి పాదయాత్ర..

Webdunia
బుధవారం, 14 జులై 2021 (16:18 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఏపీ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఏపీ సీఎంకు సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. జగన్ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పాదయాత్రలు కూడా చేస్తున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో జగనన్నని ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుకున్నాడు.
 
దీంతో అనుకున్న ప్రకారమే ఈనెల 8వ తేదీన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జగన్ కోసం పాదయాత్ర ప్రారంభించాడు. తన స్వగ్రామం నుంచి సీఎం జగన్‌ను చూసేందుకు కాలినకడన బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్‌ అనే యువకుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం ఇలా పాదయాత్ర చేయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
 
కాగా.. తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలను జగన్ నిలిపివేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. తెలంగాణ జగన్ సోదరి షర్మిల పార్టీని ప్రారంభించారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడాన్ని జగన్ వ్యతిరేకించినట్టుగా ఆ పార్టీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments