Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళలో కారంచల్లి భర్తను హత్య చేసిన భార్య... ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (11:12 IST)
మద్యం సేవించి వచ్చి నిత్యం వేధిస్తూ వచ్చిన భర్తను ఓ భార్య హత్య చేసింది. కళ్లలో కారంచల్లి నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరిఖని పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య-సుగుణమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరిలో చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసైన చంద్రయ్య భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుగుణమ్మ భర్త కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. మెడ, కాళ్లు, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
భర్త మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న సుగుణమ్మ అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది వివరించి పోలీసులకు లొంగిపోయింది. అయితే, సుగుణమ్మ అబద్దాలు చెబుతోందని, హత్యకు మద్యం తాగడం కారణం కాదని, ఇంకేదో ఉంటుందని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments