Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళలో కారంచల్లి భర్తను హత్య చేసిన భార్య... ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (11:12 IST)
మద్యం సేవించి వచ్చి నిత్యం వేధిస్తూ వచ్చిన భర్తను ఓ భార్య హత్య చేసింది. కళ్లలో కారంచల్లి నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరిఖని పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య-సుగుణమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరిలో చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసైన చంద్రయ్య భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుగుణమ్మ భర్త కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. మెడ, కాళ్లు, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
భర్త మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న సుగుణమ్మ అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది వివరించి పోలీసులకు లొంగిపోయింది. అయితే, సుగుణమ్మ అబద్దాలు చెబుతోందని, హత్యకు మద్యం తాగడం కారణం కాదని, ఇంకేదో ఉంటుందని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments