Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న ప్రధాని - 11న ఏపీలో - 12న తెలంగాణాలో

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 12వ తేదీన తెలంగాణాలో పర్యటించనున్నారు. ఏపీలో వైజాగ్, తెలంగాణాలో రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 
 
అయితే, ప్రధాని తెలంగాణ రాష్ట్ర పర్యటనపై తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మోడీ రామగుండం వస్తే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించింది. 
 
యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంశంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై సమాధానం చెప్పాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో విద్యార్థుల జేఏసీ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్రమే ఉద్దేశ్యపూర్వకంగా మోకాలొడ్డుతుందని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పైగా, ఇప్పటికే ప్రారంభించిన పరిశ్రమను కొత్తగా ప్రారంభించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments