Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:24 IST)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. కొన్ని చోట్ల ఆ మొక్కలు పెరిగి చెట్లయ్యాయి. అయితే, కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు.
 
సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ నిర్వాహకులు హరితహారం చెట్లను నరికారు. తమ హోర్డింగ్ కనిపించడం కోసం ఫుట్ పాత్‌పై ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెట్లను నరికేసిన వ్యక్తులను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. 
 
మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య రూ.45,000 జరిమానా విధించారు పట్టణంలోని మొక్కలకు ఎవరు హాని కలిగించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం