Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

సెల్వి
మంగళవారం, 3 జూన్ 2025 (10:26 IST)
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలంగాణ వెనుకబడి వుందని తెలిపారు. 
 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ, తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎత్తి చూపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ వేగవంతమైన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. 
 
కేవలం 11 నెలల్లో, ఏపీ రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 7 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. అమరావతి రాజధాని పనులను చంద్రకబాబు ఎలా అత్యవసరంగా పునఃప్రారంభించారో, రాష్ట్ర ప్రతిష్టను త్వరగా మార్చారని కూడా ఈటెల హైలైట్ చేశారు. 
 
మరోవైపు, తమ పాలనలో తెలంగాణలో ఫలితాలను అందించడంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరినొకరు నిందించుకునే బదులు నిజమైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. తెలంగాణ తన వనరులను తెలివిగా ఉపయోగించుకుని, రాజకీయ పోటీలను పక్కన పెడితే వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments