Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారంకు తీవ్ర అస్వస్థత

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:28 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు వచ్చారు. వీరంతా బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను స్థానిక అశ్వని వైద్యశాలకు తరలించారు.
 
కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ను పరీక్షించి వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోచారానికి అందిస్తున్న వైద్యసేవలను జేఈవో శ్రీనివాసరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోబీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments