Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిపై చాలా వ్యతిరేకత.. ఎందుకో ఆలోచించుకోవాలి : కేటీఆర్

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకంత వ్యతిరేకత వస్తుందో ఆలోచించుకోవాలని సూచించారు. తాము 33 జిల్లాలు ఏర్పాటు చేసినా రవ్వంత కూడా వ్యతిరేకత లేదన్నారు. మరి అమరావతి విషయంలో ఎందుకింత వ్యతిరేకత వస్తుందో ఆలోచన చేయాలన్నారు. 
 
మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశామని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక ఎక్కడా కూడా రవ్వంత వ్యతిరేకత రాలేదన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 
 
చాలా వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, తెలంగాణలో బీజేపీ - కాంగ్రెస్ మధ్య సంబంధాలపై కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల పొత్తు మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలోనూ రెండుపార్టీలూ కొన్నిచోట్ల ఇలాగే చేశాయని తెలిపారు. మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ సింహభాగం స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. 
 
బీజేపీ తరపున పోటీచేయడానికి కనీసం అభ్యర్థులు లేరని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ కూడా చాలాస్థానాల్లో అభ్యర్థులను నిలుపలేకపోయిందని అన్నా రు. రెండు జాతీయపార్టీల పరిస్థితి ఒకేలా ఉన్నదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అన్నిస్థానాలకు నామినేషన్‌ వేసిందని.. స్థానిక ఎమ్మెల్యేలు బీ ఫారాలు జారీచేశారని తెలిపారు. ఒక్కోస్థానంలో అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్టు దక్కనివారికి సర్దిచెప్పాల్సి వచ్చిందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments