Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఏడు అడుగులు కలిసి నడిచింది.. ఇపుడు మరణంలోనూ కలిసివెళ్లింది...

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:39 IST)
భర్తతో ఏడడుగులు నడిచి జీవితాంతం ఒకరికొకరు తోడూనీడలా ఉంటామని పెద్దల సాక్షిగా ఏర్పడిన భార్యాభర్తల బంధం చివరకు చావులో కూడా విడిపోమంటూ భర్తతో పాటు భార్య కూడా తనువు చాలించింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారం గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబకలహాలతో క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేని భార్య... అపర్ణ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన అపర్ణ(26)ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 
 
క్షణికావేశంలో భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సింగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు చనిపోవడం గ్రామంలోని ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments