Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఏడు అడుగులు కలిసి నడిచింది.. ఇపుడు మరణంలోనూ కలిసివెళ్లింది...

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:39 IST)
భర్తతో ఏడడుగులు నడిచి జీవితాంతం ఒకరికొకరు తోడూనీడలా ఉంటామని పెద్దల సాక్షిగా ఏర్పడిన భార్యాభర్తల బంధం చివరకు చావులో కూడా విడిపోమంటూ భర్తతో పాటు భార్య కూడా తనువు చాలించింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారం గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబకలహాలతో క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేని భార్య... అపర్ణ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన అపర్ణ(26)ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 
 
క్షణికావేశంలో భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సింగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు చనిపోవడం గ్రామంలోని ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments