Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజద్రోహం మినహా ఇతర కేసుల్లో విచారణకు ఓకే : ఆర్ఆర్ఆర్‌కు కోర్టు ఆర్డర్

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (10:04 IST)
రాజద్రోహం మినహా మిగిలిన కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌ కుషా ప్రభుత్వ అతిథి గృహంలోనే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. 
 
ఇదే కేసులో ఇతర నిందితులైన ఏబీఎన్‌, టీవీ-5లతో కలిపి ఎంపీని విచారించాలని భావిస్తే 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని పేర్కొంది. ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది. 
 
ఎంపీకి వై-కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో విచారణ గది బయట సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించాలని, కేసు విషయాలపై మినహా ఇతర అంశాలను ప్రశ్నించడానికి వీల్లేదని సీఐడీకి తేల్చిచెప్పింది. పిటిషనర్‌ హృద్రోగి అయిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. 
 
ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించినందున, ఈ కేసులో దర్యాప్తు పూర్తయినప్పటికీ సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయవద్దని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments