Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట .. కేసు కొట్టివేత

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (14:20 IST)
ఆంధ్రప్రదేష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై సీబీఐ అధికారులు నమోదు చేసిన మైనింగ్ కేసులో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమకానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 
 
సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి గత 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమంయలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించడమే కాకుండా భారీ మొత్తంలో ముడుపులు పొందారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు కేసు నమోదు అరెస్టు చేశారు. దీంతో ఒక యేడాది పాటు ఆమె జైలులో ఉన్నారు. 
 
తాజాగా ఈ కేసులో హైకోర్టు విచారించింది. శ్రీలక్ష్మిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆమె ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments