Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఓఎస్డీగా తెలంగాణ అధికారి

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (13:14 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీగా తెలంగాణ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన పేరు దశరథరామిరెడ్డి. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో జైళ్ళశాఖ సూపరెండెంట్‌గా ఉన్నారు. ఈయనను సజ్జలకు ‎ఓఎస్డి‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డిప్యూటేషన్‌పై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆయనను ఏపీలో నియమించేందుకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కు అంగీకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్.. రెండు సంవత్సరాల డిప్యూటేషన్‌కు అంగీకరించింది. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక దీంతో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments