Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పెళ్లి చేసుకోవాలని కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి...

కట్టుకున్న భార్యకు పుట్టిన మొదటి మగబిడ్డ మానసిక వికలాంగుడిగా పుట్టాడు. దీంతో ఆ కసాయి తండ్రికి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా కన్నబిడ్డను కడతేర్చాడు.

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (18:31 IST)
కట్టుకున్న భార్యకు పుట్టిన మొదటి మగబిడ్డ మానసిక వికలాంగుడిగా పుట్టాడు. దీంతో ఆ కసాయి తండ్రికి మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా కన్నబిడ్డను కడతేర్చాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా తాడూరు మండలపరిధిలోని గుతలపల్లి అనే గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి రాములమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి శివుడు (4) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు మతిస్థిమితం లేకుండా జన్మించాడు. దీంతో ఆ పిల్లాడిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో పొలంలో పని చేస్తున్న భార్య రాములమ్మతో గొడవపడ్డాడు. అపుడు అక్కడ ఉన్న శివుడికి నీళ్లలో గుళికలు తాపించడంతో బాలుడు మృతిచెందాడు. తల్లి రాములమ్మ మంగళవారం భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడిని తానే చంపాను అంటూ రాములు నేరాన్ని అంగీకరించాడు. 
 
మృతి చెందిన శివుడు మానసిక వికలాంగుడు కావడంతో భార్యతో గొడవపడి మరోపెళ్లి చేసుకోవాలనే దురుద్దేశ్యంతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments