Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొచ్చి చిత్ర హింసలు.. భరించలేక కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:20 IST)
పీకల వరకు మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్న కన్న కొడుకుని ఆ తల్లిదండ్రులు సజీహదహనం చేశారు. నిత్యం ఇంట్లోనే నరకం చూపిస్తుండటంతో కడుపు తీపిని చంపుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల అనే దంపతుల కుమారుడు కడాలి మహేష్ చంద్ర (42). ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.
 
ఈ క్రమంలో మహేష్ చంద్ర ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను వేధించసాగాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు.
 
మద్యంమత్తులో ఉన్న చంద్రను పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకునేసరికి చంద్ర పూర్తిగా కాలిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments