Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొచ్చి చిత్ర హింసలు.. భరించలేక కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:20 IST)
పీకల వరకు మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్న కన్న కొడుకుని ఆ తల్లిదండ్రులు సజీహదహనం చేశారు. నిత్యం ఇంట్లోనే నరకం చూపిస్తుండటంతో కడుపు తీపిని చంపుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల అనే దంపతుల కుమారుడు కడాలి మహేష్ చంద్ర (42). ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.
 
ఈ క్రమంలో మహేష్ చంద్ర ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను వేధించసాగాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు.
 
మద్యంమత్తులో ఉన్న చంద్రను పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకునేసరికి చంద్ర పూర్తిగా కాలిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments