కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు.. మార్చికి వాయిదా

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (16:03 IST)
Krishna
కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ వెల్లడించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. 
 
ప్రస్తుతం నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ సర్కారు కేఆర్ఎంబీని కోరింది. ఇందులో భాగంగా శుక్రవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరూ వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు. 
 
నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రస్తుత సంవత్సరంలో ఏపీ ఇప్పటికే  తన కోటా కంటే ఎక్కువగా కృష్ణానీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
 
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం వుండగా, తెలంగాణ వాదనల అనంతరం ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి విచారణ మార్చిలో జరిగే అవకాశం వుందని కమిటీ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments