Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజెక్షన్ వికటించి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు.. మృతి

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (07:32 IST)
జ్వరానికి వేసిన ఇంజెక్షన్ వికటించింది. ఫలితంగా బాలుడు శరీరం నుంచి వేడి సెగలు వచ్చాయి. అంతేనా ఆ బాలుడు మెలికలు తిరిగిపోతూ తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కాపుగల్లు అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాపుగల్లు గ్రామానికి చెందిన బాడిశ నర్సింహారావు అనే వ్యక్తి కుమారుడు కార్తీక్(5)కు గత నెల రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిపోయింది. బుధవారం నర్సింహారావు ఓ ఫంక్షన్ వెళ్లవలసి ఉంది. 
 
ఈ క్రమంలో కార్తీక్‌కు మళ్లీ జ్వరం వచ్చింది. దీంతో ఇంటికి సమీపంలో ఉన్న ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు రావడంతోపాటు మెలికలు తిరుగుతుండటంతో తల్లిదండ్రులు బాలుడిని గ్రామంలోని మదో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. 
 
బాలుడి తీరు పరిశీలించి వెంటనే కోదాడ పెద్ద దవాఖానకు తరలించాలని సలహా ఇవ్వడంతో ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడికి రెండు రోజులుగా జలుబు, జ్వరం ఉండడంతో అదే ఇంజక్షన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి స్థానిక వైద్యుడితో ఇప్పిస్తున్నారు. బుధవారం అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురై కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments