Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని చేస్తుంటే పేలిపోయిన ల్యాప్‌టాప్ - టెక్కీకి తీవ్ర గాయాలు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని చేస్తున్న సమయంలో ల్యాప్‌టాప్ పేలిపోయింది. దీంతో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా బి.కోడూరు మండలం, మేకవారి పల్లెంకుచెందిన సుమలత (22) అనే టెక్కీ బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఆమె ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. అయితే, సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌‍కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. 
 
దీంతో మంటలు చెలరేగి ఆమె దుస్తులకు అంటున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, సుమలత స్పృహతప్పి కిందపడిపోయిందివుంది. ఆ వెంటనే ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఆ యువతి శరీరం దాదాపు 80 శాతం మేరకు కాలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments