Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కరోనాతో ఉపాధ్యాయుడు మృతి.. దేశంలో లక్షన్నర కేసులు

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:14 IST)
గుంటూరులో కరోనా కారణంగా ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల గుంటూరులో కాసు సాయమ్మ అనే మున్సిపల్‌ స్కూల్‌ టీచర్‌ కరోనాతో మృతి చెందిన ఘటన మరువకముందే.. మరో ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్‌ స్కూల్‌లో మరో ఉపాధ్యాయుడు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. ఇప్పటికే స్కూల్‌లోని 10 మంది విద్యార్థులకు, టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయం తెలిసిన స్కూల్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. దీంతో ఈనెల 9 వ తేదీ వరకు స్కూలుకు అధికారులు సెలవులను ప్రకటించారు.
 
మరోవైపు భారత్‌లో సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు లక్షన్నర దాటుతున్నాయి. ఇవాళ లక్షా 68వేల 975 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 964 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య కోటి, 35లక్షల, 27వేల, 780కి చేరగా 12లక్షల, ఒక వెయ్యి, 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని కోటి, 21లక్షల, 56వేల, 529 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments