Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్జరీ కేసులో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న అరెస్టు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:05 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేసారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ అయ్యన్నపాత్రుడిపై అభియోగాలు మోపారు. ఈ కేసులో గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అలాగే, ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల అయన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఏలూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. 
 
మరోవైపు, అయ్యన్నపాత్రుడు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ఒక ముఖ్యమంత్రిగా కాకుడా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు బద్ధలు కొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments