Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా నేతలకు హ్యాండిచ్చిన చంద్రబాబు.. తెనాలి నుంచి నాదెండ్ల

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (18:38 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు సీట్లను మినహాయిస్తే 144 అసెంబ్లీ, 17ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఇప్పటికి రెండు జాబితాల్లో కలిపి 128 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 16 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఈసారి సీనియర్లకు, బడా నేతలకు చంద్రబాబు హ్యాండిచ్చారు. 
 
గుంటూరు జిల్లాలో సీనియర్ నేత అయిన ఆలపాటి రాజాకు ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా ఆయన ఆశించిన తెనాలి స్థానం జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత అయిన కళా వెంకట్రావు సీటు ఈసారి డైలమాలో ఉంది. కొవ్వూరు నుంచి టికెట్ ఆశించిన మాజీమంత్రి జవహర్‌కు సెకండ్ లిస్ట్‌లో షాక్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆయన స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావు అవకాశం కల్పించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని మాజీమంత్రి పీతల సుజాతకు టీడీపీ నాయకత్వం తొలి జాబితాలో షాక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఆమెకు కాకుండా రోషన్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చింది. 
 
అయితే టీడీపీ నాయకత్వానికి ఇప్పటికి కూడా పీతల సుజాత విధేయురాలిగానే కొనసాగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీమంత్రి దేవినేని ఉమకు కూడా సీటు దక్కలేదు. మైలవరం సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments