Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : 34 మంది అభ్యర్థుల పేర్లతో టీడీపీ రెండో జాబితా!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థుల పేర్లతో తన రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. ఇటీవల 94 మంది అభ్యర్థుల పేర్లతో ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ రెండో జాబితాలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అలాలగే, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్ చౌదరి, చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పల్లా రామచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. అధికార వైకాపాకు కంచుకోటగా ఉన్న కందుకూరు బరిలో ఇంటూరు నాగేశ్వర రావును బరిలోకి దించారు. 
 
అలాగే, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాస రావు బరిలోకి దిగుతుండగా, వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం కేటాయించారు. కాగా, ఈ రెండో జాబితాలో మొత్తం 34 మంది పేర్లు ప్రకటించగా, అందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు పీహెచ్‌డీ, 11 మంది పీజీ, 9 మంది గ్రాడ్యుయేషన్, 8 మంది ఇంటర్ చదివిన వారు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments