Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిగివచ్చిన ఏపీఎస్ఆర్టీసీ : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి సభకు బస్సులు ఇచ్చేందుకు సిద్ధం...

Advertiesment
apsrtc bus

ఠాగూర్

, మంగళవారం, 12 మార్చి 2024 (09:11 IST)
ఏపీఎస్ ఆర్టీసీ దిగివచ్చింది. ఈ నెల 17వ తేదీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి నిర్వహించే ఉమ్మడి బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఎన్ని బస్సులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి లేఖ రాసింది. 
 
టీడీపీ - జనసేన పార్టీ సభలకు ఆర్టీసీ బస్సు కావాలంటూ ఇన్నాళ్ళూ ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క బస్సును కూడా కేటాయించని ఆర్టీసీ అధికారులు ఇపుడు దిగివచ్చారు. టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరడంతో ఇపుడు వారికి భయం పట్టుకుంది. దీంతో ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కోరారు. 
 
అయితే, ఆర్టీసీ యాజమాన్యం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుకు బలమైన కారణం లేకపోలేదు. టీడీపీ - జనసేన పార్టీలో బీజేపీ కూడా కలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల నేతల ఆగ్రహానికి గురికావడం ఎందుకని భావించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
చిలకలూరిపేట సభకు బస్సులు కావాలంటూ అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు వెంటనే స్పందించిన అధికారులు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇస్తే సమకూర్చుతామని సమాచారం పంపించారు. గత ఐదేళ్లుగా టీడీపీ, జనసేన పార్టీ సభలకు ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సును కూడా కేటాయించని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఇపుడు ఎన్ని బస్సులైన సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్చీలో దర్జాగా కూర్చొని మీసం మెలేస్తున్న భట్టి విక్రమార్క.. రాహుల్ ప్లేట్‌లోని దోశను లాగిస్తున్న కోమటిరెడ్డి...