Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌న్న‌వ‌రంలో ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి చంద్ర‌బాబు చెక్!

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (19:57 IST)
తెలుగుదేశం త‌ర‌ఫున గన్నవరంలో గత ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించడం ఆ పార్టీకి ఓ పెద్ద దెబ్బ అయింది. దీనికి తోడు వంశీ అక్కడికెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తుండటం మరో ఇబ్బందిగా మారింది. దీంతో గన్నవరంలో ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే వంశీని ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు, అక్కడికి పాత కాపు, ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను పంపాలని నిర్ణయించారు. 
 
 
గతంలో గన్నవరం నుంచి గెలిచిన చరిత్ర ఉన్న ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కు ఇప్పటికీ అక్కడ పూర్తిగా పట్టుంది. దీంతో పాటు గద్దె రామ్మోహ‌న్ కు రాజకీయంగా ప‌ట్టుతో పాటు, ప్రజల్లో కూడా సౌమ్యుడనే పేరుంది. దీంతో గద్దెను గన్నవరానికి పంపడం ద్వారా అక్కడ వంశీని ఓడించగలమని టీడీపీ భావిస్తోంది. అయితే, దీనిపై ఎమ్మెల్యే గ‌ద్దె రియాక్ష‌న్ ఎలా ఉంద‌న్న‌ది మాత్రం పార్టీ వర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. గ‌తంలో ఇలానే దేవినేని అవినాష్ ని గుడివాడకు పంపి ఓడించిన‌ట్లు, గ‌ద్దె పరిస్థితి కూడా త‌యార‌వుతుందేమో అనే అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments