Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నేతలను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:58 IST)
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెదేపా నేతలు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద, కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. వైసీపీ రౌడీమూకల దౌర్జన్యకాండపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

మూడు రోజుల క్రితం జోగి రమేష్‌ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్‌ను తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ మీకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments