Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎంపీలకు జాక్‌పాట్... పెద్దపీట వేస్తున్న కేంద్రం!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:39 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు జాక్‌పాట్ తగిలింది. పార్లమెంట్ కీలక కమిటీల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. అనేకమంది ఎంపీలకు పార్లమెంట్ కీలక కమిటీల్లో చోటుకల్పిస్తుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎంపీలకు పార్లమెంట్‌కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటుదక్కింది. 
 
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలో పార్థసారథి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే, టీడీపీకి ఒక మంత్రిత్వ స్థాయి సంఘం చైర్మన పదవి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 
 
ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే సర్కారు మనుగడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లపై ఆధారపడివున్న విషయం తెల్సిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments