టీడీపీ ఎంపీలకు జాక్‌పాట్... పెద్దపీట వేస్తున్న కేంద్రం!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:39 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు జాక్‌పాట్ తగిలింది. పార్లమెంట్ కీలక కమిటీల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. అనేకమంది ఎంపీలకు పార్లమెంట్ కీలక కమిటీల్లో చోటుకల్పిస్తుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎంపీలకు పార్లమెంట్‌కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటుదక్కింది. 
 
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలో పార్థసారథి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే, టీడీపీకి ఒక మంత్రిత్వ స్థాయి సంఘం చైర్మన పదవి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 
 
ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే సర్కారు మనుగడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లపై ఆధారపడివున్న విషయం తెల్సిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments