Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ లీడర్స్ గజ మోసగాళ్లు : టీడీపీ ఎంపీలు

భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే బీజేపీ నేతలను గజ మోసగాళ్లుగా ఆరోపిస్తున్నారు.

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (15:15 IST)
భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే బీజేపీ నేతలను గజ మోసగాళ్లుగా ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, విభజన హామీల పరిష్కారంతో పాటు నిధుల కేటాయింపులో బీజేపీ పూర్తిగా అన్యాయం చేయడాన్ని ఏపీ ప్రజలతో పాటు టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని నిరసలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తెదేపా ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని, సీఎం రమేష్ తదితరులు బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ ఆందోళన సభలో కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీ పెద్ద మోసం చేసిందని, వారి కంటే పెద్ద మోసగాళ్లు బీజేపీ నేతలేనని ఆగ్రహించారు. 
 
కాంగ్రెస్ తలుపులు వేసి అన్యాయం చేస్తే, వీళ్లు తలుపులు తెరిచి మోసం చేశారని రాయపాటి ధ్వజమెత్తారు. 'బాహుబలి' చిత్రం సాధించిన కలెక్షన్ల కంటే ఏపీకి తక్కువ ఇచ్చారని గల్లా జయదేవ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments