బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

Webdunia
సోమవారం, 1 మే 2023 (17:33 IST)
సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, గతంలో తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇలాగే అరెస్టు చేశారన్నారు. ఎలాంటి మచ్చలేని నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, వాసు. ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే వారిని అరెస్ట్‌ చేశారు. ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైకాపా ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించే తెదేపా 'మహానాడు' చరిత్రలో నిలిచిపోతుంది అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments