Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుంది... టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (09:06 IST)
వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా, షర్మిల తనకు కూతురుతో సమానమన్నారు. అందువల్ల ఆమెపై విమర్శలు చేయడం తనకు సబబుగా ఉండదన్నారు. 
 
ఇటీవల తెలుగుదేశం పార్టీపై షర్మిల చేసిన విమర్శలుపై జేసీ ప్రస్తావిస్తూ, షర్మిల తనకు కుమార్తెలాంటిందన్నారు. ఆమె కులాంతర వివాహం చేసుకున్నపుడే వైఎస్‌తో పాటు తాను కూడా ఆమెను అభినందించానని చెప్పారు. 
 
ఇకపోతే, జగన్ కేసీఆర్‌ల మధ్య స్నేహబంధు ఈనాటికి కాదన్నారు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. అందువల్ల జగన్‌తో కేటీఆర్ భేటీ కావడాన్ని పెద్ద అంశంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. 
 
నిజానికి జగన్, కేసీఆర్‌లు గత యేడాది కాలంగా కలిసి పనిచేస్తున్నారన్నారు. ఇపుడు కొత్తగా కలవలేదన్నారు. అయితే, కేసీఆర్‌ వంటి వ్యక్తులు మరో పదిమంది వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments