Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుంది... టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (09:06 IST)
వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిలను విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా, షర్మిల తనకు కూతురుతో సమానమన్నారు. అందువల్ల ఆమెపై విమర్శలు చేయడం తనకు సబబుగా ఉండదన్నారు. 
 
ఇటీవల తెలుగుదేశం పార్టీపై షర్మిల చేసిన విమర్శలుపై జేసీ ప్రస్తావిస్తూ, షర్మిల తనకు కుమార్తెలాంటిందన్నారు. ఆమె కులాంతర వివాహం చేసుకున్నపుడే వైఎస్‌తో పాటు తాను కూడా ఆమెను అభినందించానని చెప్పారు. 
 
ఇకపోతే, జగన్ కేసీఆర్‌ల మధ్య స్నేహబంధు ఈనాటికి కాదన్నారు. వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. అందువల్ల జగన్‌తో కేటీఆర్ భేటీ కావడాన్ని పెద్ద అంశంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. 
 
నిజానికి జగన్, కేసీఆర్‌లు గత యేడాది కాలంగా కలిసి పనిచేస్తున్నారన్నారు. ఇపుడు కొత్తగా కలవలేదన్నారు. అయితే, కేసీఆర్‌ వంటి వ్యక్తులు మరో పదిమంది వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments