Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలుసుకోకుండా జీవో నెంబర్ 2 : టీడీపీ నేతల వ్యంగ్యాస్త్రాలు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:49 IST)
హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఆదివారం సమావేశమయ్యారు. భాగ్యనగరిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం వైకాపా నేతల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భేటీపై ఏకంగా ఏడుగురు మంత్రులు ఎదురుదాడికి దిగారు. అదేసమయంలో టీడీపీ నేతలు కూడా తమదైనశైలిలో తిప్పికొట్టారు. వైకాపా నేతలపై వ్యంగ్యస్త్రాలు కూడా సంధించారు. 
 
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ, తమ శాఖల పురోగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ భేటీపై మాత్రం అతిగా స్పందించారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాఫీ తాగేందుకు కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారు. ఇక ఇద్దరు కలిసి భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమైపోతారో అంటూ వ్యాఖ్యానించారు. మున్ముందు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకుండా జీవో నెంబరు 2 తీసుకువస్తారేమో అంటూ అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
కాగా, హైదరాబాద్‌లో జరిగిన భేటీ కోసం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. వారిద్దరూ దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఇటీవల విపక్ష నేతల ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా వైకాపా ప్రభుత్వం జీవో నంబరు 1ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఇది వైకాపా మంత్రులు, నేతలు జీర్ణించుకోలేక, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments