Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మహానాడు ఒక్క రోజు మాత్రమే.. వేదిక ఒంగోలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:04 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడును ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని తీర్మానించారు. ఈ మహానాడుకు ఒంగోలు వేదికకానుంది. 
 
సాధాణంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ.రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్ విధానంలోనే ఈ పార్టీ మహానాడును నిర్వహిస్తూ వచ్చారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది ఒంగోలు కేంద్రంగా ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో ఈ మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
 
28వ తేదీన నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరూ హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారభించి వీటిని ఒక యేడాది పాటు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments