Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మహానాడు ఒక్క రోజు మాత్రమే.. వేదిక ఒంగోలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:04 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడును ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని తీర్మానించారు. ఈ మహానాడుకు ఒంగోలు వేదికకానుంది. 
 
సాధాణంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ.రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్ విధానంలోనే ఈ పార్టీ మహానాడును నిర్వహిస్తూ వచ్చారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది ఒంగోలు కేంద్రంగా ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో ఈ మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
 
28వ తేదీన నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరూ హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారభించి వీటిని ఒక యేడాది పాటు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments