Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఇంటిని కూల్చివేస్తే దేశంలో హింస ఆగిపోతుంది : ఆప్ నేతలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (08:51 IST)
దేశ రాజధానిలోని ఉత్తర ఢిల్లీలో జహంగీర్‌పురి ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ చర్యను ఢిల్లీ ఆప్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రతిఘటిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితికి కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఆప్ నేత ఆతిషి ఆరోపించారు. 
 
దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింస ఆగాలంటే తొలుత కూల్చాల్సింది హోం మంత్రి అమిత్ షా ఇల్లు అని వ్యాఖ్యానించారు. హోం మంత్రి అమిత్ షా ఇంటిని కూల్చివేస్తే దేశంలో ఘర్షణలకు శాశ్వత ముగింపు లభిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి, హనుమంతుడి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణల వెను అమిత్ షాతో పాటు.. బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే, ఈ ఆక్రమణల కూల్చివేతపై మరో ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ, బుల్డోజర్లతో ఇళ్లు కూల్చాల్సివస్తే తొలుత కూల్చాల్సింది అమిత్ షా ఇంటినే అని ప్రకటించారు. అది జరిగితే తప్ప దేశంలో ఘర్షణలు ఆగబోవన్నారు. ఢిల్లీలో నేటి పరిస్థితికి బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఢిల్లీని 15 యేళ్ల పాలించిన బీజేపీ ఆ సమయంలో లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని ఆరోపించారు. ఇపుడు వాటిని ఆక్రమణల పేరుతో తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments