Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (15:42 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేసారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనగా బయలుదేరి సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గత బడ్జెట్ లో రూ.93వేల కోట్లను బడ్జెట్ అనుమతి లేకుండా వైకాపా ప్రభుత్వం ఖర్చుచేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందంటూ విమర్శలు గుప్పించారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 
 
బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు మల్లుతున్నాయంటూ బుచ్చయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లన్నీ వైకాపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసిందని.. ఇక రాష్ట్రంలో ఏం మిగులుతుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments