Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నాయకుల దారుణ హత్య .. శ్మశానానికి వెళ్తుండగా ఘోరం

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (09:53 IST)
కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో అన్నదమ్ములను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర రెడ్డి, అతని తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. శ్మశానానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 
 
తొలుత బొలేరో వాహనాలతో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపేశారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు సమాధి వద్దకు మూడు రోజుల మెతుకులు వేసేందుకు శ్మశానానికి వెళ్తుండగా కాపు కాచి ప్రత్యర్థులు హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments