Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిమనిషితో సంసారం చేస్తున్న భర్త.. దీక్షకు దిగిన భార్య.. ఎక్కడ..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (22:57 IST)
పనిమనిషితో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను వదిలేశాడు ఓ భర్త. అయితే ఆ భర్త మాత్రం తన భర్త కోసం దీక్షకు దిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 8వ వార్డు సాయినగర్ కాలనీలో తన భర్తను తనకు వదిలిపెట్టాలంటూ ఒక భార్య దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 
 
తూర్పాటి బిక్ష్యం దంతలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన రామానుజమ్మకు మూడు దశబ్ధాల క్రితం పెళ్లి అయింది. ఐదుగురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో పని మనిషి రూపంలో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఇంట్లోని పనిమనిషితో తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని భార్య రామానుజమ్మ ఆరోపిస్తుంది.
 
పనిమనిషిని పెళ్లి చేసుకుని తనను, తన పిల్లలను భర్త పట్టించుకోవడం లేదని చెబుతోంది. తన భర్తను తనకు వదిలేయాలని అడిగితే పనిమనిషి దాడులు చేస్తుందని, పిల్లలను తన వద్దకు రాకుండా తనను ఒంటరి చేశారని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో ఈ విషయంపై సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, అధికారులు తన భర్త తన వద్దకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments