Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖల వెల్లువ‌!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:46 IST)
వినాయక చవితి ఉత్సవాలపై టీడీపీ నేత‌లు వినూత్నంగా లేఖలు రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి లేఖ‌లు సంధించారు. గ‌ణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేడుకల్లో పాల్గొంటామని, త‌మ‌ని అనుమ‌తించాల‌ని టీడీపీ నేతలు లేఖ‌లో కోరారు.
 
వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖలు ఇపుడు కొత్త ప్ర‌యోగంగా మారింది. మూకుమ్మ‌డిగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు.

గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments