Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాప‌ట్ల టీడీపీ కార్యాలయ నిర్మాణంపై అధినేత చంద్రబాబుతో చ‌ర్చ‌

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:13 IST)
గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం అద్భుతంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ లు, బాపట్ల పార్లమెంట్ కార్యాలయం నిర్మాణంపై అధినేతకు వివరించారు. 
 
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి బాపట్లకు చెందిన కీర్తిశేషులు మువ్వా సుబ్బారావు 9 సెంట్ల భూమిని అందించారని అధినేతకు తెలిపారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర మ్యాప్ లు, ప్రణాళికను అధినేత తిలకించారు. నాయకులు అందరూ సమిష్టిగా పార్టీ కార్యాలయ నిర్మాణానికి పూనుకోవాలని, పార్టీ కార్యాలయం మంచి వాతావరణం ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాని కొండ దయ బాబు, పార్టీ సీనియర్ నాయకులు జీవి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments