Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు ఓటు వేస్తే ఐదు రెట్ల చార్జీలు భరించాల్సిందే : కేశినేని నాని

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (14:52 IST)
వైసీపీ ప్రజాదరణ కోల్పోయి, అధికార దుర్వినియోగంతో పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అరాచకాలు సృష్టించి  విజయవాడ మునిసిపల్ ఎన్నికలు గెలవాలని చూస్తుంది. వైసీపీ మద్యం పంచడం, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు బలవంతంగా వసూళ్లు చేసి ఓటర్లకు పంచాలని చూస్తున్నారు.
 
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో 50 కార్పొరేటర్ సీట్లు గెలవబోతున్నాం. 21 నెలల వైసీపీ పాలనలో విజయవాడ అభివృద్ధి శూన్యం. నిత్యావసర వస్తువుల ధరలు 3 రేట్లు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పేదలకు విద్యుత్ చార్జీలు పెంచి సంక్షేమ పథకాలు తొలిగిస్తున్నారు. సంక్షేమ పథకాలు రాష్ట్రంలో 30 శాతం ప్రజలకు మాత్రమే అందిస్తున్నారు.
 
మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైనేజీ పన్నులు ఏప్రిల్ 1 నుండి ఐదు రెట్లు పెంచుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వైసిపి పాలనలో ప్రతి కుటుంబం ఆర్థికంగా చితికి పోతుంది. 21 నెలల వైసిపి పాలన లో విజయవాడ నగరంలో రోడ్డుపై ఒక గుంత కూడా పూడ్చలేకపోయింది.
 
చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విజయవాడ నగర అభివృద్ధి నా బాధ్యత, కేంద్రం నుండి గతంలో కన్నా రెట్టింపు నిధులు తీసుకువచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సీపీఐకి అధికారం ఇచ్చినట్లయితే ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments