Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానం కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. కానీ అతడి ప్రాణాలు..?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (14:24 IST)
ఇండిగో విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం ల్యాండ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షార్జా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానం 6ఇ1412 మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు పాక్ గగనతంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని కరాచీకి దారి మళ్లించినట్టు ఏవియేషన్ అథారిటీ వర్గాలను ఉటంకిస్తూ పాక్ జియా న్యూస్ తెలిపింది. 
 
ఇండిగో సైతం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని కరాచీకి మళ్లించామని, దురదృష్టవశాత్తూ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడలేకపోయామని, విమానాశ్రయ వైద్య సిబ్బంది వచ్చేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
 
గత ఏడాది నవంబర్‌లోనూ ఢిల్లీ బౌండ్ గోఎయిర్ విమానం 179 మంది ప్రయాణికులతో బయలుదేరి, ఒక ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అయితే అప్పటికే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మగ ప్రయాణీకుడికి అన్ని వైద్య సహాయం ఆన్‌బోర్డ్‌లో అందించబడింది. కానీ ఆయన్ని కాపాడుకోలేకపోయామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments