Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసును తారుమారుకు కుట్రలు.. సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (06:30 IST)
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కేసును తారుమారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.

ఈ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చూపబోతున్నారని అన్నారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేకా హత్య కేసులో ముద్దాయిలు ఎవరో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు తెలుసునని అన్నారు.

పోలీసులు తమ నీతి నిజాయితీ చూపించుకునే కేసు ఇదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో డీజీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. కీలక నేత హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

కేసు గురించి తెలుసుకునే హక్కు ఒక పౌరుడిగా తనకు ఉందని అన్నారు. కేసును మసిపూసి మారేడు కాయ చేస్తే చూస్తూ ఊరుకోబోమని రామయ్య స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments