Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీకి పులివెందులలో మరో దెబ్బ.. మారుతీ వరప్రసాద్ కన్నుమూత

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (12:17 IST)
తెలుగుదేశం పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ కన్నుమూశారు.

ప్రస్తుతం మారుతీ వరప్రసాద్ పులివెందులలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. ఆయన మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ఈ మేరకు.. పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ గారు మరణించడం బాధాకరమన్నారు.
 
ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 
 
కాగా, కాపు కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, టీడీపి సీనియర్‌ నేత చలమలశెట్టి రామానుజయ కూడా కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి కూడా అధినేత సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. గంటల వ్యవదిలో ఇద్దరు నేతలు మరణించడంతో ఆ పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments