Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే.. సర్కారుకు చెంపదెబ్బ వంటిది : టీడీపీ నేత గంటా

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (18:21 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా హైకోర్టు స్టే విధించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాము ఆరంభం నుంచి చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తే ఇలానే ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు.
 
"మీ స్వార్ధ రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. అమాయక రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. అమరావతి మాస్టర్ ప్లానులో ఎలక్ట్రానిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో కనీస పరిజ్ఞానం లేకుండా ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని చూశారు. మీ ప్రయత్నాలను గురువారం హైకోర్టు తప్పు పట్టి నిర్మాణాలపై స్టే విధించింది. 
 
ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు పట్టాలు ఇవ్వదల్చుకుంటే.. ఆర్-5 జోను పరిధిలో లేనివాటిని ఇచ్చి మీ విశ్వసనీయత చాటుకోండి. అంతేకానీ పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ధ్వంసం చేయొద్దు. చట్టాలు మీకు చుట్టాలు కావనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా నెత్తికెక్కిన మీ కళ్లను కిందకుదించండి" అని గంటా శ్రీనివాసరావు ట్విట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments