Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే.. సర్కారుకు చెంపదెబ్బ వంటిది : టీడీపీ నేత గంటా

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (18:21 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా హైకోర్టు స్టే విధించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాము ఆరంభం నుంచి చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తే ఇలానే ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు.
 
"మీ స్వార్ధ రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. అమాయక రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. అమరావతి మాస్టర్ ప్లానులో ఎలక్ట్రానిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో కనీస పరిజ్ఞానం లేకుండా ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని చూశారు. మీ ప్రయత్నాలను గురువారం హైకోర్టు తప్పు పట్టి నిర్మాణాలపై స్టే విధించింది. 
 
ఆర్-5 జోనులో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు పట్టాలు ఇవ్వదల్చుకుంటే.. ఆర్-5 జోను పరిధిలో లేనివాటిని ఇచ్చి మీ విశ్వసనీయత చాటుకోండి. అంతేకానీ పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ధ్వంసం చేయొద్దు. చట్టాలు మీకు చుట్టాలు కావనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా నెత్తికెక్కిన మీ కళ్లను కిందకుదించండి" అని గంటా శ్రీనివాసరావు ట్విట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments