Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం జగన్‌: ధూళిపాళ్ల నరేంద్ర

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (15:01 IST)
లీటరు పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఎందుకు ఇవ్వడంలేదని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. అసత్యాలతో రాష్ట్రంలోని పాడి రైతులను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని  ధ్వజమెత్తారు. అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం జగన్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
 
 
1950-60వ దశకాల్లో ప్రారంభమైన పాడి రైతుల సహకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. సీఎం జగన్‌  అమూల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీ మూతపడినా పట్టించుకోని సీఎం అమూల్‌ కోసం రూ.2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూతపడే స్థితిలో ఉన్న నెల్లూరు డెయిరీని ఎందుకు కాపాడటం లేదని నిలదీశారు.
 
 
‘‘దాదాపు 30వేల మంది రైతుల నుంచి 168లక్షల లీటర్ల పాలను అమూల్‌ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్‌ చెబుతున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం అమూల్‌ సంస్థ లీటరు పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, సీఎం జగన్‌ రూ.70 అని చెప్పడం అబద్ధం కాదా?. విజయడెయిరీ 11శాతమున్న లీటరు పాలకు రూ.85.55 పైసలు ఇస్తుంటే, అమూల్‌ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77 మాత్రమే. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్‌ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. 
 
 
కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహా, రాష్ట్రంలోని మిల్క్‌ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం’’ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 1950-60వ దశకాల్లో ప్రారంభమైన పాడి రైతుల సహకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌  అమూల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీ మూతపడినా పట్టించుకోని సీఎం అమూల్‌ కోసం రూ.2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూతపడే స్థితిలో ఉన్న నెల్లూరు డెయిరీని ఎందుకు కాపాడటం లేదని నిలదీశారు.
 
 
‘‘దాదాపు 30వేల మంది రైతుల నుంచి 168లక్షల లీటర్ల పాలను అమూల్‌ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్‌ చెబుతున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం అమూల్‌ సంస్థ లీటరు పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, సీఎం జగన్‌ రూ.70 అని చెప్పడం అబద్ధం కాదా?. విజయడెయిరీ 11శాతమున్న లీటరు పాలకు రూ.85.55 పైసలు ఇస్తుంటే, అమూల్‌ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77 మాత్రమే. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్‌ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహా, రాష్ట్రంలోని మిల్క్‌ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం’’ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

సంబంధిత వార్తలు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మనసుతో, ప్రేమతో తీసిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి: సాయి రాజేష్

హరిక్రిష్ణ మనవడు తారకరామారావు జూ.ఎన్.టి.ఆర్.కు పోటీ అవుతాడా?

మత్స్యకారుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే రేవు రిలీజ్ కు రెడీ

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

తర్వాతి కథనం
Show comments