Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎర్రచందనం దుంగల‌ స్వాధీనం

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:32 IST)
తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వినాయకుని ఆలయం వద్ద ఆరవ కల్వర్టు పడమర వైపున స్మగ్లర్లు నుంచి 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ నాయకత్వంలో  ఆర్ ఎస్ ఐ లు వినోద్ కుమార్, విశ్వనాథ్ బృందం రాత్రి తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో కూంబింగ్ నిర్వ‌హించారు.  
 
 
కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడవేసి కేకలు వేస్తూ చీకటిలో కలిసి పోయారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలు లభించాయి.


ఎస్పీ సుందరరావు మాట్లాడుతూ ఈ దుంగలు 699 కిలోలు ఉన్నాయని, విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. ఈ కేసును సిఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఎస్ ఐ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments