Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎర్రచందనం దుంగల‌ స్వాధీనం

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:32 IST)
తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వినాయకుని ఆలయం వద్ద ఆరవ కల్వర్టు పడమర వైపున స్మగ్లర్లు నుంచి 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ నాయకత్వంలో  ఆర్ ఎస్ ఐ లు వినోద్ కుమార్, విశ్వనాథ్ బృందం రాత్రి తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో కూంబింగ్ నిర్వ‌హించారు.  
 
 
కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడవేసి కేకలు వేస్తూ చీకటిలో కలిసి పోయారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలు లభించాయి.


ఎస్పీ సుందరరావు మాట్లాడుతూ ఈ దుంగలు 699 కిలోలు ఉన్నాయని, విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. ఈ కేసును సిఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఎస్ ఐ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments