Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ రౌడీయిజం.. ఠాణా భవనం నుంచి దూకేసిన మాజీ సర్పంచ్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (19:18 IST)
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తమ లాఠీ పవర్ చూపించారు. వారు పెట్టిన వేధింపులు తాళలేని ఓ మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈయన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కుమారుడు కావడం గమనార్హం. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా షేర్ మహమ్మదాపురం మాజీ సర్పంచ్ అవినాశ్ చౌదరి. షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీంతో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఖాకీలు అవినాశ్‌ను వేధించసాగారు. 
 
ఈ వేధింపులు తాళలేని అవినాశ్... స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్‌పైకి ఎక్కారు. ఆయనను అడ్డుకోవడానికి ఒక వ్యక్తి రాగా... వెంటనే ఆయన పై నుంచి దూకేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments